సైనిక బలగాల పటిష్టత విషయంలో మోదీ ప్రభుత్వం ఎప్పుడు ముందుగా నిలుస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సైనిక బలగాల అవసరాలు, ప్రాధాన్యాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని అక్షరాల సాకారం చేసి చూపిస్తోంది. అందుకే శత్రుదేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని తీసుకుని వచ్చింది.
తాజాగా సైనిక దళాల పటిష్టత కోసం 1.45 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా మొత్తం పది రకాల సాధన సంపత్తి ని సమీకరిస్తున్నారు. ఇందులో 99% ఆయుధాలను పూర్తిగా దేశీయ సంస్థల నుంచి సహకరించడం గమనార్హం. ప్రధానంగా భారత సైన్యానికి ఎక్కువగా ఉపయోగపడే యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ కోసం పెద్దపీట వేస్తున్నారు అలాగే భవిష్యత్ తరం పోరాటాల శకటం అయిన కొత్త రకం శకటాలను సమీకరణకు కూడా ఆమోదం తెలియజేశారు. వీటి ద్వారా ఎటువంటి ఉపరితలం నుంచి అయినా చురుకుగా కదులుతూ శత్రువు మీద దాడి చేయడం సాధ్యమవుతుంది. అలాగే శత్రువుల దాడిని నుంచి కాపాడుకునేందుకు బహుళ అంచనా రక్షణ కవచాలు కూడా ఉంటాయి.
మరోవైపు గగన స్థలంలోని లక్ష్యాలను గుర్తించి వాటి గమనాన్ని పరిశీలించేందుకు రాడార్లను సమీకరిస్తున్నారు. అవసరం అయితే ఈ రాడార్ల నుంచి నేరుగా దాడులు కూడా జరపవచ్చు.
మరోవైపు నావిక బలగాల పటిష్టత కోసం నేరుగా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలి అని నిర్ణయించారు. మన యుద్ధ నౌకల మీద కొలువుతీరి ఈ విమానాలు అవసరం అయినప్పుడు శత్రువుల మీదకు దాడులు చేయగలుగుతాయి.
మొత్తం మీద భారత రక్షణ బల గల పటిష్టత కోసం మోడీ ప్రభుత్వం చక్కటి చర్యలు తీసుకుంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రపంచంలోనే ఐ అండ్ ఆయుధాల్ని భారత సైనిక బలగాలు సమకూర్చుకుంటున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ ఆయుధ సంపత్తి దేశంగా తయారు చేయడం విశేషం. ఇటువంటి చర్యలతో మన దేశ సైనిక బలగాల సామర్థ్యం మరింత పెరగడం ఖాయం. అంతిమంగా భారతదేశాన్ని సురక్షిత వాతావరణంలో నిలపగలుగుతోంది.