ఉత్తర కశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో భారత ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయింది. అందులో ఉన్న పైలట్ మరణించారు.కో-పైలట్ కు గాయాలయ్యాయి. కశ్మీర్లో బందిపోరా జిల్లాలో గురేజ్ సెక్టార్లోని గుజ్రాన్ నల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అస్వస్థతకు గురైన బీఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకెళ్లేందుకు చాపర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన కో-పైలట్ను వైద్య సదుపాయానికి తరలించారని.. హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. రెస్క్యూ టీం సహాయచర్యలు కొనసాగుతున్నాయి. వైమానిక, నిఘా బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)