‘ఉదారశక్తి’ అనే ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత వైమానిక దళానికి చెందిన బృందం ఈరోజు మలేషియాకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్(RMAF) మధ్య జరుగుతున్న మొదటి ద్వైపాక్షిక వ్యాయామం ఇది. భారత వైమానిక దళం Su-30 MKI, C-17 విమానాలతో వైమానిక విన్యాసాల్లో పాల్గొంటుండగా.. RMAF Su 30 MKM విమానాలను నడుపుతోంది. భారతీయ దళం నేరుగా వారి గమ్యస్థానమైన క్వాంటన్ RMAF స్థావరానికి బయలుదేరింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కసరత్తులో రెండు వైమానిక దళాల మధ్య వివిధ వైమానిక పోరాట విన్యాసాలు జరగనున్నాయి.