2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, భారతదేశం నుంచి వ్యవసాయ ఎగుమతులు 2021-22లో 19.92 శాతం పెరిగి 50.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధిక సరకు రవాణా రేట్లు, కంటైనర్ కొరత మొదలైన రూపంలో లాజిస్టికల్ సవాళ్లు ఉన్నప్పటికీ ఎగుమతుల పెరుగుదల సాధించింది భారత్.
బియ్యం (9.65 బిలియన్ డాలర్లు), గోధుమలు (2.19 బిలియన్ డాలర్లు), చక్కెర (4.6 బిలియన్ డాలర్లు) తోపాటు ఇతర తృణధాన్యాలు (1.08 బిలియన్ డాలర్లు) మేర ఎగుమతులు సాధించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం వల్ల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని రైతులకు మేలు జరిగిందని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లో బియ్యం ఎగుమతితో భారతదేశం వాటా దాదాపు 50 శాతానికి చేరింది.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతి $7.71 బిలియన్లు ఉండటంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా గుజరాత్ వంటి తీరప్రాంత రాష్ట్రాల రైతులకు అత్యధికంగా ప్రయోజనం చేకూరుస్తోంది. మసాలాల ఎగుమతులు వరుసగా రెండవ సంవత్సరం $4 బిలియన్లకు చేరుకున్నాయి.
విపరీతమైన సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, కాఫీ ఎగుమతులు మొదటిసారిగా $1 బిలియన్ను అధిగమించాయి, ఇది కర్ణాటక, కేరళ సహా తమిళనాడులోని కాఫీ పెంపకందారులకు ఉత్సాహాన్ని కలిగించింది. వారణాశి నుంచి తాజా కూరగాయలతో పాటు మామిడి, అనంతపురం నుంచి అరటి, నాగ్పూర్ నుంచి నారింజ, లక్నో నుంచి మామిడి, తేని నుంచి అరటి, షోలాపూర్ నుంచి దానిమ్మ, కృష్ణా, చిత్తూరు జిల్లాలనుంచి మామిడి ఎగుమతులు గణనీయంగా జరిగాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)