భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమేనని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.హర్యానా సమాలఖాలో జరిగిన అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. హిందూ రాష్ట్ర లేదా హిందూ జాతి అనేది సాంస్కృతిక భావన అని అయితే ప్రభుత్వ వ్యవస్థ రాజ్యాంగభావన అని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయపార్టీల నేతలు తరచూ ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేయడంపై స్పందిస్తూ….ఆయన రాజకీయంగా బాధ్యతాయుతంగా ఉంటే మంచిదన్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రాదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పనికట్టుకుని కొందరు దేశ చరిత్రను వక్రీకరిస్తూ వచ్చారని..ఇప్పటికైనా వాస్తవాలను భారతీయ సమాజానికి తెలిపేలా చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.