పొరుగు దేశం శ్రీలంకకు కారులో వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయి. తమిళనాడు కేరళకు వెళ్ళినట్లు గా..
రాబోయే రోజుల్లో శ్రీలంకకు కూడా కారులో ,, టూరిస్ట్ బస్సుల్లోను వెళ్లి రావచ్చు.
భారత్ శ్రీలంక మధ్య సముద్ర జలభాగం నెలకొని ఉంది. అందుచేత విమానాల్లో మాత్రమే శ్రీలంక వెళ్లడానికి వీలవుతుంది. కానీ పురాణాల్లో చెప్పినట్లుగా భారత్ శ్రీలంక మధ్య రామసేతు పేరుతో ఒక నిర్మాణం జరిగి ఉంది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని సముద్రంలో వంతెన నిర్మించాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి పరిపాలనలో ఉండగానే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తయింది. ఇప్పుడు తాజాగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఈ వంతెన నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు.
మన్నాడ్ ప్రాంతంలో ఇందుకు సంబంధించి రెండు దేశాల అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. రెండు దేశాల మధ్యన నిర్మాణం ఏర్పడినట్లయితే రోడ్డు రవాణా రూపొందుకుంటుంది ఫలితంగా శ్రీలంకకు టూరిస్టుల సంఖ్య విస్తారంగా పెరుగుతుంది మరోవైపు పారిశ్రామికరణకు అవకాశాలు పెరుగుతాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన నిర్మాణం మీద రెండు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈనెల 20న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రోడ్డు మార్గం నిర్మాణానికి సంబంధించి ఒప్పందం ఖరార్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం ద్వారా రెండు దేశాల మధ్య విద్యుత్ సరఫరా ఊబందుకుంటుంది.
మొత్తమ్మీద రామసేతు లేదు అని వాదించే నాస్తికులకు కనువిప్పు కలిగే విధంగా గా… భారత్ శ్రీలంకల మధ్య రానన్న కాలంలో వంతెన ఏర్పాటు కానుంది.