
S&P అంచనా ప్రకారం 2030 నాటికి భారతదేశ వార్షిక నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సగటున 6.3% ఉంటుంది. అదేవిధంగా, 2031 నాటికి భారతదేశ GDP ప్రస్తుత స్థాయిల కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ఆఫ్షోరింగ్, ఉత్పత్తిరంగానికి ప్రాధాన్యత ఇచ్చి పెట్టుబడులు ఆకర్షించడం, సోలార్ మరియు సంప్రదాయేతర విద్యుత్ రంగాలపై పెట్టుబడులే కాకుండా ముఖ్యంగా దేశం లో అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోసే పరిస్థితులు భారత్లో ఉన్నాయి” అని రిధమ్ దేశాయ్ మరియు గిరీష్ అచ్చిపాలియా నేతృత్వంలోని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు నివేదికలో రాశారు.
అభివృద్ధి ఇచ్చే ఈ చర్యలు దశాబ్దం ముగిసేలోపు భారతదేశం ని ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరియు స్టాక్ మార్కెట్గా నిలబెడతాయి అని చెప్పారు.
జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం సంవత్సరానికి 6.3% వృద్ధిని నమోదు చేసింది, ఇది రాయిటర్స్ పోల్ అంచనా 6.2% కంటే పాక్షికంగా ఎక్కువ. దీనికి ముందు, భారతదేశం ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే ఏప్రిల్ నుండి జూన్ వరకు 13.5% అభివృద్ధి నమోదు చేసింది, ఇది దేశ సేవా రంగంలో బలమైన దేశీయ డిమాండ్తో పుంజుకుంది.
రీఫినిటివ్ డేటా ప్రకారం, జూన్ 2021 వరకు మూడు నెలల్లో దేశం రికార్డు స్థాయిలో 20.1% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
కొన్ని సంస్కరణలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి, దేశంలో బడ్జెట్ నిధులు ఎక్కువగా క్యాపిటల్ పెట్టుబడులు అంటే దీర్ఘకాల శాశ్వత పెట్టుబడులు కేటాయించాలనే ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తూ నిమ్ అన్నారు.
భారతదేశం మరింత ఎగుమతి ఆధారిత హబ్గా మారుతోంది. S&P విశ్లేషకుల ప్రకారం, భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రంగా మరియు ఉత్పాదక శక్తి కేంద్రంగా మారుద్దామన్న స్పష్టమైన దృష్టిని కలిగి ఉంది, దాని కోసం ఉత్పత్తులు పెంచడానికి మరియు ఎగుమతులను పెంచడానికి ( PLIS) ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
“భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం గురించి బహుళజాతి సంస్థలు గతంలో కంటే ఎక్కువ ఆశాజనకంగా ఉన్నాయి … మరియు ప్రభుత్వం మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు ఫ్యాక్టరీలకు భూమిని సరఫరా చేయడం ద్వారా పెట్టుబడిని ప్రోత్సహిస్తోంది” అని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు చెప్పారు.
తక్కువ ధరలో కార్మికులు, తక్కువ తయారీ ఖర్చు, పెట్టుబడికి పారదర్శక వాతావరణం, వ్యాపార-స్నేహపూర్వక విధానాలు మరియు వినియోగానికి బలమైన ప్రవృత్తి కలిగిన యువ జనాభా ఉండటం భారత్ కి బలాలు అని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుండి సీనియర్ విశ్లేషకుడు సుమేధా దాస్గుప్తా అన్నారు. .
ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది అని అన్ని ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్న ఈ సమయంలో భారత్ మాత్రమే నిలకడ అయిన అభివృద్ధి సాధిస్తుంది అని అన్ని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మోడీ 2014లో వచ్చిన తరువాత తీసుకు వచ్చిన దీర్ఘకాల ఆర్థిక సంస్కరణలు డెమో, GST, డిజిటల్ బ్యాంకింగ్, విద్యుత్, రోడ్లు, రైలు, విమాన సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు అన్నిటి కంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అవినీతి లేదు అనే గట్టి సంకేతాలు ప్రపంచం అంతా చేరడం వల్ల భారత్ ఆర్థికంగా నేడు పటిష్టంగా వుంది.
అయినా మన మేధావుల దృష్టిలో మోడీకి పాలించడం రాదు. వెంటనే పదవిలోంచి దింపేసి రాబ్రీ దేవిని అయినా ఫరవాలేదు ప్రధానిని చేసేద్దాం అనే శక్తులకు మద్దతు ఇస్తున్నారు.
దేశం చేసుకున్న ఖర్మ. : చాడా శాస్త్రి