యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఆర్మీ సహా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాస్త్రవేత్తల బృందాలు సంయుక్తంగా ఈ విమాన పరీక్షను నిర్వహించాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఘనత సాధించిన DRDO, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసిన బృందాలను డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అభినందించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)