భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటంచాలని ధర్మసంసద్ పిలుపునిచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని పవిత్ర త్రివేణి సంగమం దగ్గర మాఘమేళా సందర్భంగా నిర్వహించిన ధర్మసంసద్ వేదికగా సాధువులు పిలుపునిచ్చారు. సుమేరు శంకరమఠాధిపతి స్వామి నరేంద్రనంద సరస్వతి సహా పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, సాధువులు పాల్గొన్న ఈ ధర్మ సంసద్లో మూడు తీర్మానాలను ఆమోదించారు. భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ తోపాటు మతమార్పిడులకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
హరిద్వార్ ధర్మ సంసద్లో విద్వేష ప్రసంగాలు చేశారన్నకేసులో అరెస్టు చేసిన హిందూ సాధువు యతి నరసింహానంద తోపాటు ఇటీవలే హిందూ మతాన్ని స్వీకరించిన షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ జితేంద్ర నారాయణ్ త్యాగిని వెంటనే విడుదల చేయాలని ధర్మసంసద్ డిమాండ్ చేసింది. మహాత్మాగాంధీని జాతిపితగా, పండిట్ జవహర్లాల్ నెహ్రూను దేశ తొలి ప్రధానమంత్రిగా గుర్తించడానికి ఈ సదస్సులో కొందరు సాధువులు నిరాకరించారు. 15 దేశాల మద్దతు ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోసును దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రకటించాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికే బోసు భారత్కు ప్రధానమంత్రని ఆయన చెప్పారు. సమావేశానికి జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాహకకులు దీని పేరును ధర్మ సంసద్కు బదులుగా సంత్ సమ్మేళన్ అని మార్చినట్లు వర్గాలు తెలిపాయి.