భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ వ్యాఖ్యానించారు. దేశంలో లవ్ జిహాద్ నిజంగానే కొనసాగుతోందని ఆరోపించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఈ లవ్ జిహాద్ కొనసాగుతోందని పీసీ జార్జ్ అన్నారు. ఆదివాసీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఎన్జీవో హెచ్ఆర్డీఎస్ ఇండియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. 2030 నాటికి భారత్ను ముస్లిం దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నోట్ల రద్దు జరగినందుకే ముస్లింల ప్రక్రియ కాస్త ఆలస్యమైందని.. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలోకి చొరబడ్డముస్లింలు.. ఆ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అనేక క్రైస్తవ దేశాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. ఈ అంశానికి చెక్ పెట్టాలంటే భారత్ను వెంటనే హిందూ దేశంగా ప్రకటించాలని పీసీ జార్జ్ అన్నారు. సుప్రీంకోర్టు లవ్ జిహాద్ అనేది లేదని పేర్కొన్నప్పటికీ.. లవ్ జిహాద్ ఉన్నదని తనకు తెలుసన్నారు.