సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొరతను తీర్చేందుకన్నట్టు భారత్ డీజిల్ ను పంపిందని సిలోన్ కేంద్రమంత్రి తెలిపారు. ఇక 40 వేల టన్నుల బియ్యాన్ని భారత్ శ్రీలంకకు పంపింది.
రెండు దేశాలు గత నెలలో $1 బిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇది మొదటి ప్రధాన ఆహార సహాయం. కొంతకాలంగా రెట్టింపు అయిన ధరల్ని తగ్గించే వీలు ఏర్పడింది ఆ దేశంలో.సంస్థ భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాల మధ్య కుదిరిన క్రెడిట్ సదుపాయ ఒప్పందం ప్రకారం పట్టాభి ఆగ్రో ఫుడ్స్ … శ్రీలంక స్టేట్ ట్రేడింగ్ (జనరల్) కార్పొరేషన్కి బియ్యం సరఫరా చేస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)