మొట్టమొదటి సారిగా భారత్ చైనాకి ఎదురుగా తన నావీ ని మోహరించడానికి సిద్ధపడ్డది!
క్వాడ్ గ్రూప్ [అమెరికా,జపాన్,భారత్,ఆస్ట్రేలియా ]లో భాగంగా చైనాకి వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రం లోకి నాలుగు యుద్ధ నౌకలని పంపడానికి నిర్ణయం తీసుకుంది భారత్. ఈ సారి నాలుగు దేశాలు కలిసి యుద్ధం అంటూ వస్తే ఒకరికోకరు ఎలా సహకరించుకోవాలి అనే అంశం మీద డ్రిల్ చేయబోతున్నాయి.
ఇది పరోక్షంగా చైనాకి హెచ్చరిక చేస్తున్నట్లే ! ఒక పక్క తూర్పు లాడాక్ లో మనతో కయ్యానికి కాలు దువ్వూతూ మరో వైపు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న చైనాకి ఇది గట్టి హెచ్చరిక ! ఇప్పటి వరకు మలబార్ ఎక్సర్సైజ్ పేరుతో హిందూ,అరేబియా సముద్రాలలో సంయుక్త విన్యాసాల పేరిట అమెరికా తో కలిసి పని చేసినా ఇప్పుడు ఏకంగా పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా నావీ బేస్ ఉన్న గువాం [Guam] దీవుల వద్ద నాలుగు దేశాలు కలిసి సంయుక్తంగా విన్యాసాలు చేయడం అనేది మామూలు విషయం కాదు.
మరో పక్క చైనా కూడా తన యుద్ధ నౌకలని దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది భారత్ ఇంకా తన నెవీ ని పంపక ముందే . ఇది ఎలాంటి చర్య జరిగినా ప్రతి చర్య కోసమే అని అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాలో కృత్రిమంగా నిర్మించిన నావీ బేస్ లతో పాటు ఎయిర్ బేస్ లనుండి యుద్ధానికి సన్నద్ధంగా ఉండడానికి తన జెట్ ఫైటర్స్ ని భారీ స్థాయిలో మోహరించింది చైనా. తాజా శాటిలైట్ చిత్రాలు చైనా మిలటరీ కదలికలని గుర్తించాయి.
అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్[Antony Blinken] గత నెల 27,28 వ తేదీలలో భారత్ పర్యటనకి వచ్చినపుడు భారత్ విదేశాంగ మంత్రి శ్రీ జై శంకర్ తో పాటు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యారు. చర్చల పర్యవసానమే భారత్ తన నేవీ ని పసిఫిక్ మహా సముద్రంలోకి పంపడానికి కారణం అయ్యింది.
ఆంటోని బ్లిన్కెన్ భారత్ వచ్చి చర్చలు జరిపి వెళ్ళిన తరువాత పెంటగాన్ భారత్ కి హార్పూన్ మిసైల్స్ అమ్మడానికి తుది అనుమతి ఇచ్చింది[Harpoon Joint Common Test Set (JCTS). ఇది మరింత అనుమానాలకి తావు ఇచ్చే చర్య ఎందుకంటే యాంటీ షిప్ మిసైల్ అయిన హార్పూన్ కోసం భారత్ అడిగినది కానీ గత ఏప్రిల్ నుండి తుది అనుమతి కోసం పెంటగాన్ వద్ద పెండింగ్ లో ఉంది కానీ ఆంటోని బ్లిన్కెన్ భారత్ వచ్చి వెళ్ళిన వారం రోజుల లోపే $82 మిలియన్ డాలర్ల హార్పూన్ మిసైల్ వ్యవస్థని భారత్ కి అమ్మడానికి తుది అనుమతి వచ్చింది. అంటే ఒక పద్దతి ప్రకారమే ఇదంతా జరుగుతున్నది అని అనుకోవచ్చు. ఉత్తీతి బెదిరింపులు కోసమే అయితే షిప్ కిల్లర్ హార్పూన్ ని భారత్ ఎందుకు కొంటుంది ? అమెరికా ఎందుకు అంత తొందరగా అమ్మడానికి అనుమతి ఇస్తున్నది ? హార్పూన్ మిసైల్స్ ని అమెరికా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మదు. పైగా మొదటి సారిగా పూర్తి సిస్టమ్ ని అమ్ముతున్నది మనకి.
one Harpoon Intermediate Level maintenance station; spare and repair parts, support, and test equipment; publications and technical documentation; personnel training; US Government and contractor technical, engineering, and logistics support services; and other related elements of logistics and programme support.
2016 లో శ్రీ నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు ‘భారత్ ని వ్యూహాత్మక రక్షణ భాగస్వామి ‘ గా గుర్తించింది మొదటి సారిగా. అపాచీ,చినూక్ హెలికాప్టర్ల తో పాటు సబ్ మెరైన్ హంటర్ హెలికాప్టర్ల ని కూడా ఇచ్చింది భారత్ కి. అయితే భారత్ దగ్గర సముద్రం మీద పహారా కాసే బోయింగ్ కి చెందిన P8-పోసోడియన్ విమానాలకి ఎయిర్ లాంచ్ వెర్షన్ హార్పూన్ మిసైల్స్ ని వాడినట్లయితే అవి చాలా యాక్యురేట్ గా పనిచేస్తాయి బహుశా ఇప్పుడు కొంటున్న వాటిలో ఎయిర్ లాంచ్ వెర్షన్ కూడా ఉండి ఉండవచ్చు.
అయితే మరోపక్క రష్యా,చైనా,ఇరాన్ లతో కూడిన గ్రూపుని ఏర్పాటు చేసింది చైనా. ఏదన్నా యుద్ధం అంటూ వస్తే చైనాకి తోడుగా రష్యా వస్తుందా ? ఇదే జరిగితే చాలా తేడాలు వచ్చేస్తాయి. ఎందుకంటే క్రమంగా రష్యా భారత్ నుండి దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తున్నది.
భారత్ నుండి పసిఫిక్ మహా సముద్రంలోకి వెళుతున్న నాలుగు యుద్ధ నౌకలు ఇవి.
1. INS Ranvijay (D55): Rajput-class Guided-missile Destroyer.
2. INS Shivalik (F47): Shivalik-class Guided-missile Frigate.
3. INS Kadmatt (P29): Kamorta-class Anti-Submarine Corvette.
4. INS Kora (P61): Kora-class Guided-missile Corvette.