అమెరికాలో ఉన్న మన వాళ్ళు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఫోన్లు వాడుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించండి.
ఇన్ని రోజులూ ప్రపంచం ‘మేడ్ ఇన్ చైనా’ ఆపిల్ ఫోన్లు, మేడ్ ఇన్ చైనా సామ్ సంగ్ ఫోన్లు పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉంటే ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆపిల్ ఫోన్లు, ‘మేడ్ ఇన్ ఇండియా’ సామ్ సంగ్ ఫోన్లు కూడా ఉపయోగిస్తోంది.
గత సం. మన దేశం నుండి ఎగుమతి అయిన స్మార్ట్ ఫోన్లు విలువ ₹82,000కోట్లు. 2014లో మన దేశం ఎగుమతి చేసిన స్మార్ట్ ఫోన్లు విలువ సుమారు ₹2500కోట్లు మాత్రమే. అది 2015 అయ్యేసరికి జీరో అయిపోయింది.
గత సం. చేసిన ₹82,౦00కోట్ల ఎగుమతులలో 50% వాటా ఆపిల్ ఫోన్లు ది కాగా 40% వాటా సామ్ సంగ్ ఫోన్లు ది. ఆపిల్ సంస్థ మెల్లి మెల్లిగా తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుండి భారత్ తరలిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ వార్త ప్రకారం ఈ మొబైల్ పరిశ్రమ వేల మందికి కొత్తగా ఉపాధి చూపిస్తోంది, ఒక్క ఆపిల్ పరిశ్రమే గత 19 నెలల్లో ఒక లక్ష మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు కల్పించింది అని ఈ పేపర్ రాసింది.
ఈ ఎగుమతులు ఎక్కువగా యుఎస్, యూకే, ఇటలీ, నెదర్లాండ్స్, యుఎయి కి జరుగుతున్నాయి. 2014 లో కేవలం 2 మాత్రమే మొబైల్ ఉత్పత్తి పరిశ్రమలు ఉంటే, మోడీ ప్రభుత్వం వచ్చాక మొదలు పెట్టిన “మేక్ ఇన్ ఇండియా” పుష్ వల్ల ఇప్పుడు 260 కి పైగా పరిశ్రమలు మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.
2014లో మన దేశం మొత్తం ₹17,900కోట్ల విలువైన 5.80కోట్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తే, గత సం. సుమారు ₹2,75,000 కోట్ల విలువైన 31 కోట్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేసింది.
ఇప్పుడు ప్రపంచంలో చైనా తరువాత ఎక్కువ మొబైల్స్ ఉత్పత్తి చేసే దేశంగా భారత్ రెండో స్థానానికి చేరింది.
….చాడా శాస్త్రి….