అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం తన అధికారిక బ్లాగ్ గేట్స్ నోట్స్ లో భారత్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచదేశాలన్నీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్ లాంటి డైనమిక్ దేశాన్ని సందర్శించడం గర్వంగా ఉందని గేట్స్ అన్నారు. కరోనా భూతం విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో అనేక దేశాలకు వాక్సిన్ల్ అందించి కోట్లాదిమంది ప్రాణాలు కాపాడిన దేశం భారత్ అని బిల్ గేట్స్ అన్నారు.