కోవిడ్ కట్టడిలో ప్రపంచదేశాలన్నింటికన్నా భారతే ముందుందన్నారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని… కోవిడ్ కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని ఆయన అన్నారు. వైద్యసిబ్బంది చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. చాలా దేశాలను చూశాను అని..అక్కడి వాళ్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నానని…ప్రతిఒక్కరూ ఈ విషయంలో భారత్ ను అభినందిస్తున్నారని పూనావాలా అన్నారు. బూస్టర్ డోస్ గా అందించేందుకు కోవావ్యాక్స్ టీకాకు 10-15 రోజుల్లో అనుమతి వస్తుందని తెలిపారు.