మేడ్-ఇన్-ఇండియా లేజర్-గైడెడ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ATGM)ని ప్రధాన యుద్ధ ట్యాంక్ (MBT) అర్జున్ ద్వారా డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ కలిసి ఈరోజు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లో KK రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించాయి.
మిస్సైల్స్ ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించాయి. లక్ష్యాలను రెండు వేర్వేరు పరిధుల నుంచి విజయవంతంగా ఓడించాయి. టెలిమెట్రీ వ్యవస్థలు మిస్సైల్స్ విమాన పనితీరును నమోదు చేశాయి. ATGMను మల్టీ ప్లాట్ ఫారం లాంచ్ క్యాపబిలిటీతో అభివృద్ధి చేశారు. ATGM ప్రస్తుతం MBT అర్జున్ కు చెందిన 120 mm రైఫిల్డ్ గన్ ద్వారా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
లేజర్-గైడెడ్ ATGMల విజయవంతమైన పనితీరుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDO, భారత సైన్యాన్ని అభినందించారు.