సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆమె తన నిర్ణయం చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. ‘‘సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది’’ అని సోనియా అన్నారు. సోనియా గాంధీ తెలిపారు.యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004,2009లో పార్టీ సాధించిన విజయాలు, ఆనాటి పాలన తనకెంతో సంతృప్తినిచ్చాయన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని… దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయని సోనియా మండిపడ్డారు.
https://twitter.com/ANI/status/1629412093802999808?s=20