రేపటినుంచి భారత్ లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు ఇండియాలో నిలిచిపోనున్నాయంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయా ఆప్ లపై కేంద్ర మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించిందనీ అంటున్నారు. మరి ఎలాంటి ఆంక్షలు, అసలేంజరుగుతోందనే దానిపైనా సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోందది.
అసలైతే 2021 ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త నియమావళి రూపొందించింది. ఇదే ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి విదేశీసంస్థలకు ఇబ్బందిగా మారింది. కొత్త నియమావళి మే 26 నుంచి అమలు కానుంది. అందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అంగీకరించపోతే వాటిపై వేటేనని అంటున్నారు. ఈ కొత్త ఐటీ నిబంధనల్లో పలు కీలకాంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులుండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు వంటివి ఈ నియమాల్లో ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ ఏ సంస్థ కూడా ఈ నిబంధనల్ని అంగీకరించలేదు. అదే సమయంలో ఆరు నెలల సమయం కోరితే కేంద్రం అంగీకరించలేదు. అందుకే ఇప్పుడీ మూడు సంస్థలపై నిషేధం తప్పదా అనే చర్చ సాగుతోంది. మే 26వ తేదీ నుంచి ఈ మూడు సంస్థలు బ్లాక్లిస్ట్లోకి వెళ్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా తాత్కాలికంగా ఈ సంస్థల సేవలు నిలిచిపోవచ్చనే ప్రచారం సాగుతోంది.