కుషియారా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరుదేశాల నేతలూ సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఇకముందూ ముందుకెళ్తామని మోదీ అన్నారు. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మరింత సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నట్టు వెల్లడించారు.ఇక భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న 54 నదులు ఇరు దేశాల ప్రజలకు జీవనాధారమని…అందులోనూ కుషియారా నదీజలాల పంపిణీపై కీలక ఒప్పందం చేసుకున్నామని ఇరుదేశాల నేతలూ ప్రకటించారు.
ఇటీవలే ఆజాదీకా అమృతోత్సవాలు నిర్వహించుకున్న సందర్భంగా భారత ప్రజలకు షేక్ హసీనా శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాపిత, తన తండ్రి షేక్ ముజుబుర్ రెహమాన్ ప్రసంగాల ఆధారంగా వచ్చిన పుస్తకాన్ని ఆమె మోదీకి అందజేశారు.
అంతకుముందు హసీనా రాజ్ ఘాట్ వెళ్లి గాంధీకి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్లో ఆమె గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో, ఉపరాష్ట్రపతి ధన్కడ్ తోనూ హసీనా సమావేశమయ్యారు.
Addressing joint press meet with Bangladesh PM Sheikh Hasina. https://t.co/6bnJ1zjwVF
— Narendra Modi (@narendramodi) September 6, 2022