ప్రపంచ ఫార్మసీగా భారత్ నిలుస్తోంది..అభివృద్ధిచెందిన ప్రపంచదేశాలకు ఔషధాలు భారత్ నుంచే వెళ్తున్నాయి.
అమెరికా తీసుకుంటున్న ప్రతి నాలుగు టాబ్లెట్లలో ఒక టాబ్లెట్ భారత్ కు చెందినదే ఉంటోందిట. ఆలాగే ప్రపంచం మొత్తం వినియోగించే 6 టాబ్లెట్లలో 1 భారతదేశంలో తయారైన జెనరిక్ ఔషధమే.
దేశంలో 2.25 కోట్ల మందికి పైగా ప్రజలు ఆయుష్మాన్ యోజన ప్రయోజనం పొందారు. ఇక వైద్య పరికరాలలో దేశాన్ని స్వావలంబన (ఆత్మనిర్భర్)గా మార్చేందుకు తాజాగా 4 వైద్య పరికరాల పార్కులను మంజూరు చేసింది కేంద్రం..