ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికవృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఎదుగుతోంది. అత్యంత వేగంగా వృద్ధిరేటు నమోదు చేస్తున్నట్టు ఆర్థికసర్వే తెలిపింది. 2022-23లో వృద్ధిరేటు శాతం 7గా ఉంటుందని అంచనా . 2023-24లో అది 6 నుంచి 6.8శాతానికి పరిమితం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. కొనుగోలు శక్తి పరంగా భారత్ మూడోస్థానంలో ఉంది. దేశీయంగా వినియోగం మరింత మెరుగుపడుతున్నందున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వృద్ధిని కరోనా పూర్తిగా దెబ్బతీసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దాన్ని అదుపులో తెచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా అన్నిదేశాల బ్యాంకులు అనుసరించిన వడ్డీరేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థలను అతలాకులతం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపు చర్యలతో ఈ దేశ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుకుంటోంది. ఆప్రభావంతో ఇతర అన్నిదేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ బలపడుతూ వస్తోంది. అయితే ఇతర దేశాల కరెన్సీ లతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి బలంగానే ఉంది. అంతర్దాతీయ ముడు చమురు ధరలతో సీఏడీ ఆందోళకర స్థాయిలో పెరుగుతున్నా..భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని నిపుణులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నమాట.
https://twitter.com/IMFNews/status/1620235433937629185?s=20&t=YktjPprzljaKukxKIuhXxQ