మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) దీనిపై ప్రకటనలు చేయడంపై భారత్ సైతం ఘాటుగానే స్పందించింది. మైనారిటీల విషయంలో ఏ దేశ వ్యవహారం ఎలా ఉందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించింది. పాక్ గురించి అయితే ప్రపంచమంతా తెలుసనీ అంది.
https://twitter.com/MEAIndia/status/1533687723625967616?s=20&t=_adDfw8GS3_qsFXJCwN26Q
ఈ వ్యవహారంలో నూపుర్ ను, నవీన్ జిందాల్ ను పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఇస్లామిక్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, పాకిస్థాన్ కూడా తోడైంది. ఆదేశంలోని భారత రాయబారిని పిలిపించింది..బహ్రెయిన్ ఈ వివాదంపై స్పందించినా.. నుపుర్, నవీన్ కుమార్పై బీజేపీ చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది.
ఇప్పటివరకు దీనిపై భారత ప్రభుత్వం బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ఓఐసీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది విదేశీవ్యవహారాల శాఖ. ఓఐసీ ప్రకటన పూర్తిగా అనుచితమని….
అన్ని మతాల పట్ల అత్యంత గౌరవభావం తమ ప్రభుత్వానికి ఉందనీ స్పష్టం చేసింది.
మత ప్రముఖులను కించపరచే కామెంట్లు, ట్వీట్లు ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే, అది భారత ప్రభుత్వ అభిప్రాయంగా భావించడం సరికాదని… ఉద్దేశపూర్వకంగా, తప్పుదారి పట్టించే విధంగా కామెంట్లు సరికాదని విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చి హితవు పలికారు. ”కమ్యూనల్ అప్రోచ్కు స్వస్తి చెప్పండి. అన్ని మతాలు, విశ్వాసాలను గౌరవించండి” అని సూచించారు బాగ్చి.