హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఓఐసీ పిలునిచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ లోని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని ధర్మసంసద్ వేదిగ్గా సాధువులు ముస్లింల ఊచకోతకు పిలుపునిచ్చారనీ ప్రకటనలో ఉంది. సోషల్మీడియా సైట్లలోనూ ముస్లిం మహిళల్ని వేధిస్తున్నారంటూ హిజాబ్ ధరించడంపై నిషేధం విధించారని మండిపడింది.
అయితే ఓఐసీ ప్రకటనను ఖండిస్తూ.. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక్కడి పరిస్థితుల్ని తప్పుదోవ పట్టించేలా ఆ ఓఐసీ ప్రకటన ఉందని.. తమ దేశంలో ఏదన్నా సమస్య వస్తే… రాజ్యాంగం, ప్రజాస్వామిక నియమావళికి లోబడి పరిశీలించి పరిష్కరించుకుంటామని బదులిచ్చింది.
https://twitter.com/MEAIndia/status/1493588093818998790?s=20&t=qqluXcJumfQAIzPW2zywvw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)