తైవాన్ చుట్టూ చైనా కసరత్తులు నిర్వహించిన తర్వాత అక్కడ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరింది. తైవాన్ లో జరుగుతోన్న పరిణామాలపై అనేక ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. అక్కడ ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని.. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి కృషి చేయాలని మేం కోరుతున్నామని బాగ్చీ చెప్పారు.
యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనపై మండిపడుతున్న చైనా.. తైవాన్ పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ద్వీపం చుట్టూ అనేక విమానాలు, యుద్ధనౌకలను మోహరించింది.