పాక్పై సర్జికల్ స్ట్రైక్.. ఉగ్ర చెర నుంచి ఇద్దరి సైనికులకు విముక్తి
ఉగ్రవాదులకు కేరాఫ్గా ఉన్న పాక్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అయితే ఈ సారి చేసింది భారత్ మాత్రం కాదు. పాక్ పొరుగదేశమైన మరో ఇస్లామిక్ దేశమైన ఇరాన్.మంగళవారం రాత్రి పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు ఆ దేశం ప్రకటించింది. పాక్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ దేశానికి చెందిన ఇద్దరు జవాన్లను విడిపించేందుకు ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపింది. పాక్లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసి ఇరాన్ తన జవాన్లను తీసుకుపోయింది.
పాక్లో ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించి.. జవాన్లను తీసుకుపోయినట్లు ఇరాన్కు చెందిన ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీ) ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం జైష్ ఉల్ అదల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు తమ సైనికులను అపహరించారని.. వారిని విడిపించుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైనికాధికారులు వెల్లడించారు. కాగా, అమెరికా, భారత్ తర్వాత పాక్ దేశంలోని ఉగ్ర సంస్థలపై సర్జికల్ స్ట్రైక్ చేసిన మూడోదేశంగా ఇరాన్ అవతరించింది.