నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న కమలదళానికి సీట్లతో పాటు ఓట్లు పెరిగాయి. ఉత్తరప్రదేశ్లో కొన్ని సీట్లు తక్కినా ఓవరాల్ గా ఓట్లశాతం గణనీయంగా పెరిగింది. ఉత్తరాఖండ్ లో స్వల్ప సీట్లు, స్వల్పంగా ఓట్లూ తగ్గాయి. ఇక గోవా, మణిపూర్లో ఓట్లు పెంచుకున్న పార్టీకి పరాజయం పాలైన పంజాబ్ లోనూ గతంలోకన్నా ఓట్లు అధికంగానే వచ్చాయి.
యూపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39.67 ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 41.8శాతం ఓట్లు దక్కించుకోవడం విశేషం. గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 32.5శాతం ఓట్లు రాగా..ఈ సారి 33.3 శాతం ఓట్లు వచ్చి చేరాయి. మణిపూర్లో క్రితంసారి 36.3 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి 37.5 శాతం ఓట్లు సాధించింది.
ఉత్తరాఖండ్ లో మాత్రం గత ఎన్నికల్లో 46.5 శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడగా ఈసారి స్వల్పంగా తగ్గింది. 44.3 శాతం ఓట్లు కమలం పార్టీకి పోలయ్యాయి.
గతంలో పంజాబ్ లో 5.4శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి ఈసారి అక్కడా ఓట్లు పెరిగాయి. 6.6 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)