తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై అదనంగా ఒక యూనిట్ కు 40 నుంచి 50 పైసలు పెరిగాయి. పరిశ్రమలు ఇతర వర్గాల వారికి రూపాయి చొప్పున పెంచడానికివిద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతించింది. దీంతో అదనంగా వినియోగదారులపై 5596 కోట్ల ఆర్థిక భారం పడబోతోంది. 2016-17 తర్వాత ఐదేళ్లకు 2022-23 తిరిగి కరెంటు చార్జీలు పెరుగుతున్నాయి. నూతన చార్జీల వివరాలను మండలి చైర్మన్ శ్రీరంగారావు మీడియాతో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గ ప్రజలకు 101 యూనిట్ల వరకూ వ్యవసాయానికి పూర్తి ఉచిత కరెంటు ఇస్తామని తెలిపారు.
ఇళ్లకు పెరిగిన చార్జీల వివరాలు :-
ఎల్ టీ 1(ఏ) కేటగిరీ:-
50 యూనిట్లలోపు పాత చార్జీ 1.45 నుంచి కొత్త చార్జీల ప్రకారం 1.95 కానుంది. 51-100 యూనిట్లలోపు పాత చార్జీ 2.60 నుంచి కొత్త చార్జీల ప్రకారం 3.10 అవనుంది.
ఎల్ టీ 1 (బీ1) కేటగిరీ:-
1-100 యూనిట్లలోపు పాత చార్జీ 3.30 నుంచి కొత్త చార్జీల ప్రకారం 3.40 కానుండగా.. 101-200 యూనిట్లలోపు పాత చార్జీ 4.30 నుంచి కొత్త చార్జీల ప్రకారం 4.80 గా మారనుంది.
ఎల్ టీ 1 (బీ2) కేటగిరీ:-
1-200 యూనిట్లలోపు పాత చార్జీ 5.00 నుంచి కొత్త చార్జీల ప్రకారం 5.10 రూపాయలుగా.. 201-300 యూనిట్లలోపు పాత చార్జీ 7.20 నుంచి కొత్త చార్జీల ప్రకారం 7.70 రూపాయలుగా.. 301-400 యూనిట్లలోపు పాత చార్జీ 8.50 నుంచి కొత్త చార్జీల ప్రకారం 9.00 రూ/- గా.. 401-800 యూనిట్లలోపు పాత చార్జీ 9.00 నుంచి కొత్త చార్జీల ప్రకారం 9.50 రూ/- గా.. 800 యూనిట్లు దాటితే 9.50 నుంచి కొత్త చార్జీల ప్రకారం 10 రూపాయలుగా మారనున్నాయి.