దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన 15 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపన్నుశాఖ అటాచ్ చేసింది. బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, 1988 ప్రకారం ఈ ఆస్తిని అటాచ్ చేసింది. ఓ వ్యక్తి తన పేరుమీద కాక…తనకు సంబంధించిన ఇతర వ్యక్తుల పేర్లతో , లేదా కల్పిత వ్యక్తుల పేర్లమీద ఆస్తులు పెట్టడాన్ని బినామీ లావాదేవీ లేదా బినామీ ఆస్తి అంటారు.
కొన్ని నెలలుగా ఐటీ శాఖ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఆపరేషన్లో భాగంగానే 2 వేల కోట్ల ఆస్తులను ఇప్పటికే ఐటీ ఆటాచ్ చేసింది.