కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. బారాముల్లాలో బహిరంగసభలో హోంమంత్రి ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి ఆజాన్ వినిపించింది. దీంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు అమిత్షా. ఆజాన్ ముగియగాన్…మసీదులో ప్రార్థన జరుగుతోందని చీటీ అందింది. ఇప్పుడు ప్రార్థన ఆగినట్టుంది..ఇక మాట్లాడవచ్చా అని సభలో ఉన్నవారి అనుమతి తీసుకుని తిరిగి ప్రసంగం ప్రారంభించారు. ఆసమయంలో సభలోని వారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ…అమిత్షా జిందాబాద్ అంటూ నినాదాలు చేయసాగారు. ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/ListenIqbal/status/1577657050615554049?s=20&t=3LTUexZT63KMCc0clbcX0Q