ఉత్తరప్రదేశ్ ఘోరం జరిగింది. 7ఏళ్ల దళితబాలికపై అత్యాచారం జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చందౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది.
తన కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా పొరుగున ఉండే తాలిబ్ తనను నమ్మించి తీసుకెళ్లాడని..అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చిన్నారి తండ్రి తెలిపారు. బాలిక అరుపులు విని అక్కడ ఉన్న కొందరు అటువైపు పరుగెత్తారు. దీంతో నిందితులు పారిపోయారు. తరువాత చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నారు. గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అటు బాధితురాలి కుటుంబానికి హిందుసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అటు దర్యాప్తు వేగవంతంచేశామని… నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
లఖింపూర్ ఖేరీ జిల్లాలోనూ ఇద్దరు దళితబాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన జునైద్, సొహైల్, ఆరిఫ్, హఫీజ్, కరీముద్దీన్, చోటూ అనే ఆరుగురిని యూపీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిలో సొహైల్, జునైద్ అనే యువకులు ఆ ఇద్దరు బాలికల్ని చెరుకుతోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తరువాత వారిని హత్యచేసి దుప్పట్లతో చెట్టుకు ఉరేశారు. హత్య తరువాత కరీముద్దీన్ ,ఆరిఫ్ ను పిలిచారు. ఆత్మహత్యగా నమ్మించాలనుకుని ఆ ఇద్దరు బాలికల్ని చెట్టుకు ఉరేశారు.