భారతదశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవనాన్ని ప్రారంభిస్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ముహూర్తాన్ని ఖాయం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం 2014, మే 26న మోదీ మొదటిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2020 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది.రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్ మధ్య ఉన్న 3 కిలోమీటర్ల స్థలంలో పార్లమెంట్ భవనం సహా కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మించారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లను ఏర్పాటు చేశారు. 64, 500 చదరపు మీటర్ల పరిధిలో పాత పార్లమెంటు అంత ఎత్తులో దీనిని నిర్మించారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు ఇందులో కూర్చోవచ్చు.