ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమయానికి సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో తొలిసమావేశం నిర్వహించారు.
11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్ను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, క్యాంటీన్ను నిర్మించారు. 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్లు నిర్మించారు.
https://twitter.com/BRSparty/status/1654046912239263744?s=20