దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించారు. కేసీఆర్ దంపతులు తో పాటు కవిత, పార్టీ ముఖ్యనేతలు యాగంలో పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం తరువాత పార్టీ జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
https://twitter.com/BRSparty/status/1602956360689209344?s=20&t=24HMdt1bw4gj-JzSkGRl7g