
file photo
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడుకానీ ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర్శించారు. వందకుపైగా కార్లు పంపి ఏపీ నేతలను పిలిపించుకుని మరీ తన పార్టీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని ..సీఎం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఇబ్బంది పడుతోందని సంజయ్ అన్నారు.