మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళను ఇంటికే వెళ్లి విచారించాల్సి ఉండగా..తనను కార్యాలయానికి పిలిపించుకున్నారని అందులో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండానే తన ఫోన్లు సీజ్ చేశారనీ ఆమె కోర్టుకు తెలిపారు. అయితే కవిత పిటిషన్ ను విచారణకు తీసుకుంటున్నట్టు కోర్టు తెలిపింది. అదే సమయంలో ఈనెల 16న కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
#BreakingNews | #SupremeCourt refuses to stay summons for #BRS leader K Kavitha in #delhiexcisepolicy case; K Kavitha to appear before #ED@anany_b shares more details#DelhiLiquorScam #kkavitha | @toyasingh pic.twitter.com/TLjTo0W7eJ
— News18 (@CNNnews18) March 15, 2023