ఇండో పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించి 50ఏళ్లు. విజయ్ దివస్ స్మారకంగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక స్టాంప్ ఆవిష్కరించారు. ఇండియన్ పోస్ట్ స్పెషల్ డే కవర్ గా ను రూపొందించారు.
పాకిస్థాన్ సాయుధ బలగాలు 1971 డిసెంబర్ 16 న భారత సైన్యానికి లొంగిపోయిన రోజును విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. నాటి విజయం భారత కమాండర్ ల , సైనికుల వీర పరాక్రమాలకు ప్రతీకగా నిలిచింది. రాజ్ నాథ్ ఆవిష్కరించిన పోస్టల్ స్మారక స్టాంప్ భారత దేశ చరిత్ర లో గొప్ప ఘట్టాన్ని గుర్తు చేసుకునే విధంగా ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ లోగోతో ఉంది. భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ కుశాల్ చంద్రశేఖర్ ఈ లోగో ను రూపొందించారు.