అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి ఈడీ షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారద కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎమ్మెల్యే సమీర్ చక్రవర్తి, ప్రముఖ ఆర్టిస్ట్ సువప్రసన్నలకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం తమ ముందు హాజరుకావాలంటూ సమీర్ చక్రవర్తికి ఈడీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ ఆర్టిస్ట్ సువప్రసన్నను సోమవారం నాడు విచారించనున్నారని తెలుస్తోంది.
కాగా, కోట్లాది రూపాయల స్కాంగా ఉన్న శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో అక్రమ లావాదేవీల కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫేక్ స్కీమ్స్లను ప్రచారం చేసి.. సామాన్య ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు సేకరించి మోసం చేసినట్లు శారదా గ్రూప్స్పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.