బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు అన్ని పార్టీలూ కలిసి రావాలని కోరారు. నితీష్ తో కలిసి పట్నాలో ప్రెస్ మీట్ నిర్వహించారు సీఎం. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని… నితీశ్ సైతం అదే కోరుకుంటున్నారనీ అన్నారు. పొరుగుదేశం చైనాతో పోలిస్తే మనం ఎక్కడో ఉన్నామనీ అన్నారు.
బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనే దానిపై సమాధానం దాటవేశారాయన. విస్తృతంగా చర్చ జరిగాక నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.