మరో కేసులో ఇరుక్కున్నారు టీఎంసీ వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రా. కాళీకామాతపై అభ్యంతర కరమైన ట్వీట్ చేసి కేసును ఎదుర్కొంటున్న ఆమె తాజాగా అసోం సమాజాన్ని కించపరుస్తూ ట్వీట్ చేసింది. అస్సామీల మనోభావాలు కించపరిచిదంటూ ఆమెపై ఫిర్యాదులు వెళ్లడంతో కేసునమోదైంది. మొయిత్రా బేషరతు క్షమాపణ చెప్పాలని జాతీయ సంగ్రామీ సేన డిమాండ్ చేసింది. ఆందోళన నిర్వహించిన అనంతరం శివసాగర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గొగోయ్ అనే ఇంటిపేరును లైంగిక వేధింపులకు లింక్ చేసిన ఆమెపై చర్యలకు వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/MahuaMoitra/status/1547488321076871169?s=20&t=3IrxCmO0SoTXGB7joJZSWw
పార్లమెంటరీ వ్యవహారాల్లో కొన్ని పదాలను నిషేధించే నిర్ణయాన్ని విమర్శించే సందర్భంలో ఆమె ఆ ట్వీట్ చేశారు. మిస్టర్ గొగోయ్ అంటూ ఆమె వాడిన పదంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అసలైతే అసోంలో ఓ కమ్యూనిటీ ప్రజలు ఇంటిపేరు గోగోయ్.
ఆమె ఉద్దేశపూర్వకంగా లైంగిక వేధింపులు అనే పదాన్ని మిస్టర్ గొగోయ్ గా మార్చందని… ఇది అసోం సమాజం పరువుతీయడమే అని స్థానికులు మండిపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవడం ద్వారా అసోం కమ్యూనిటీ పవిత్రత, సమగ్రత, గౌరవాన్ని కాపాడాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే ఓ వర్గం పేరును ప్రస్తావిస్తూ ఇలా పరువు తీయడం సరికాదని అసోంకు చెందిన జాతీయ సంగ్రామి సేన అధ్యక్షుడు చితు బారువా అన్నారు. ‘మహువా మైత్రా మోకరిల్లి, చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పవలసి ఉంటుంది’ అని అన్నారాయన.
ప్రముఖ నిర్మాత, సినీ విమర్శకుడు ఉత్పల్ సైతం మహువాపై మండిపడ్డారు. ఎవరు ఈ మిస్టర్ గొగోయ్.. ఆయన పూర్తి పేరు చెప్పండి.. కానీ ఇలా గోగోయ్ లందర్నీ దూషించడం సరికాదు… అన్ పార్లమెంటరీ పదాల జాబితా హాస్యాస్పదంగా ఉండవచ్చు కానీ ఇలా వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు.
అయితే పెద్దఎత్తున విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గింది మహువా. నేనే గొగోయ్ లందర్నీ లక్ష్యంగా చేసుకున్నట్టు సంఘీలు ప్రచారం చేస్తున్నారు… అక్కడ నేను చెప్పదలుచుకున్నది. మిస్టర్ రంజయ్ గొగోయ్ గౌరవనీయ ఎంపీ, రాజ్యసభ మాత్రమే అని మరో ట్వీట్ చేశారు. తాను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తినే అన్నానని స్పష్టం చేశారు.
https://twitter.com/MahuaMoitra/status/1547821900578971648?s=20&t=UyyvpcLaeHGhUN6JWh9SGw
అసోంలో ఆగ్రహం వ్యక్తం అవుతుండడంతో అసోం టీఎంసీ చీఫ్ రిపున్ బోరా సూచన మేరకు మొయిత్రా మరో ట్వీట్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ ట్వీట్ కు , పార్టీకి సంబంధం లేదని మొయిత్రా వ్యక్తిగత బాధ్యతతో చేసిన ట్వీట్ అదని పార్టీ స్పష్టం చేసింది. అసలైతే దీనిపై జోక్యం చేసుకోవాలని బోరా టిఎంసి హైకమాండ్తో మాట్లాడారని…పార్టీ సూచన మేరకు తాను గొగోయ్ కమ్యూనిటీని కాక ఓ వ్యక్తిని మాత్రమే అన్నానని మొయిత్రాతో స్పష్టం చేయించినట్టు తెలిసింది.
మొయిత్రా వ్యాఖ్యలతో రాష్ట్రంలో టీఎంసీ ఉనికికే ప్రమాదమని బోరా వేగంగా స్పందించినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ఊహించని స్థాయిలో ఆమెపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
2019 ఏప్రిల్లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కోర్టు సుమోటోగా తీసుకుని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్కు బదిలీ చేసింది. ఆ కేసులో ఆయనకు ధర్మాసనం క్లీని చిట్ ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొయిత్రా ఈ ట్వీట్ చేసింది. అయితే ఆయన పూర్తి పేరను కాక అసోంలో ఓ కమ్యూనిటీకి చెందిన ఇంటిపేరును మాత్రమే రాయడంతో వివాదం చెలరేగింది.