మళ్లీ చిక్కుల్లో పడ్డారు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆయనపై మరో కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సీబీఐ సిద్ధమైంది. డిల్లీ లిక్కర్ స్కాం కేసు ఓవైపు నడుస్తుండగానే…అవినీతి నిరోధకచట్టంలో భాగంగా ఢిల్లీలోని ఫీడ్ బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో ఉపముఖ్యమంత్రి సిసోడియా విచారణ ఎదుర్కోనున్నారు. సోసిడియాను విచారించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరగా…కేంద్రం అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. వివిధ మంత్రుత్వశాఖలు, సంస్థలు, ప్రతిపక్షపార్టీల నేతలపై గూఢచర్యం కోసం 2015లో ఆప్ సర్కారు రహస్యంగా ఫీడ్బ్యాక్ యూనిట్ను ఏర్పాటు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ స్నూపింగ్ విభాగానికి మనీష్ సిసోడియా నేతృత్వం వహించారనీ ఓ అధికారి ఫిర్యాదు చేయడంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఫీడ్బ్యాక్ యూనిట్లో పలు అవకతవకల్ని గుర్తించిన ఢిల్లీ విజిలెన్స్ విభాగం సూచనల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టారు.
https://twitter.com/ANI/status/1628225722342051840?s=20