
file photo
మనీలాండరింగ్ కేసులో బెయిల్ పై ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ కు మరో కేసులో వారెంట్లు జారీ అయ్యాయి. బీజేపీ నేత కీర్తి సోమయ్య భార్య మేథా సోమయ్య వేసిన పరువునష్టం దావాలో సంజయ్ కు స్థానిక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశించినప్పటికీ విచారణకు హాజరుకానందున సెవ్రి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ వారెంట్లు జారీ చేశారు. ముంబై సమీపంలోని మీరీ భయేందర్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి కీర్తి సోమయ్య, మేథా సోమయ్య 100 కోట్ల స్కామ్కు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు. దీనిపై మేథా సోమయ్య పరువునష్టం కేసు వేశారు.