భారత దేశ స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి కాక తన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు కొనియాడారు. రష్యాను ఖండించాలని ఇయు అధికారులు పాకిస్థాన్ను కోరినప్పుడు.. భారత్ నూ అదే మాట అడిగే ధైర్యం వారికి ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లోని మలాకాండ్లో జరిగిన బహిరంగ సభలో తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ, భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.నవాజ్ షరీఫ్ , షాబాజ్ షరీఫ్లిద్దరూ ఉక్రెయిన్ పై దాడి విషయంలో రష్యాను సమర్థించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/OsintUpdates/status/1505522562574422017?s=20&t=JOTA2DJs0-y0iPvvV_KBnQ
రష్యాను ఖండించాలని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు తనను అడిగినప్పుడు, అదే ప్రశ్న భారతదేశాన్ని అడిగే ధైర్యముందా అని వారిని అడిగానని ఇమ్రాన్ గుర్తు చేస్తూ…పాక్ శాంతికోసమే తప్ప యుద్ధం కోసం కాదనీ చెప్పానన్నారు.
ఇతర దేశాల ప్రయోజనాలకు, వారి విధానాలకు కాకుండా పాక్ పౌరుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిచ్చే విదేశాంగ విధానం కోసం తాను కృషి చేస్తున్నానని పాక్ ప్రధాని చెప్పారు. తన అభిప్రాయాన్ని చెప్తూనే భారత విదేశాంగ విధానాన్ని ఉదహరించారు. పొరుగుదేశం భారత్ కు నేను సెల్యూట్ చేస్తున్నా. ఎల్లప్పుడూ స్వతంత్ర విధానాన్నే ఆ దేశం కొనసాగించింది. QUAD కూటమిలో సభ్యదేశంగా ఉన్నా అది తటస్థవైఖరిలో ఉందిప్పుడు. ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం ప్రజలకోసం ఉంది అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
https://twitter.com/OsintUpdates/status/1505516419189919748?s=20&t=u0f0OXMdtXQIDcoaLk7Z8g
ఈ సందర్భంగా భారతప్రభుత్వంతో పాటు సైన్యాన్నీ ప్రశంసించారు పాక్ ప్రధాని. పాకిస్థాన్ కంటే భారత్ విదేశాంగ విధానం మాత్రమే కాదు… భారత సైన్యం కూడా ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని…పౌరప్రభుత్వంలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదనీ అన్నారు.
మార్చి 25న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న నేపథ్యంలో ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.