ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లపాటు తనపై అనర్హత వేటు వేసిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఖాన్. తోషాఖానా రిఫరెన్స్లో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇమ్రాన్పై ఈసీ అనర్హత వేటు వేసింది. విదేశీ నేతలు, ప్రతినిధుల నుంచి స్వీకరించిన బహుమతులు ప్రభుత్వ ఖాతాలో పడాల్సి ఉండగా..చట్టవిరుద్ధంగా సొంతానికి అమ్ముకున్నందుకు ఈ చర్య తీసుకుంది. పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎన్నికల్లో పోటీకి సైతఅనర్హుడని పేర్కొందిఈసీ. ఈసీ నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ సవాలు చేస్తూ తన న్యాయవాది బారిస్టర్ అలి జఫర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇమ్రాన్ అప్పీల్ను కోర్టు విచారణకు స్వీకరించినప్పటికీ, అప్లికేష్ వేసిన రోజే విచారణ చేయాల్సినంత అత్యవసరం కాదని పేర్కొంది. సోమవారంనాటికి విచారణను వాయిదా వేసింది.
అనర్హత వేటు వేసే అధికారం కానీ ఈసీపీకి (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్) లేదని, తన అప్పీల్పై తుది నిర్ణయం వెలువడేంత వరకూ ఈసీపీ రూలింగ్ను సస్పెండ్ చేయాలని ఇమ్రాన్ తన అప్పీల్లో కోరారు. కాగా, ఈసీపీ చెప్పిన ఐదేళ్ల కాలం అనేది ప్రస్తుత అసెంబ్లీ ఐదేళ్ల కాలానికి మాత్రమే పరిమితమవుతుందా, తీర్పునిచ్చిన రోజు నుంచి ఐదేళ్లకు వర్తిస్తుందా అనేదింకా స్పష్టత లేదు.