ఓ మహిళను వేధించిన కేసులో బ్రిటన్ కు చెందిన ఉద్యమకారిణి… లేబర్ పార్టీ ఎంపీ క్లాడియా వెబ్ బే కు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 10 వారాల జైలు శిక్ష విధించింది. తన ప్రియుడు లెస్టర్ థామస్ స్నేహితురాలైన మిచెల్ మెరిట్ ను ఆమె చంపుతానని బెదిరించినట్టు విచారణలో తేలింది. ఆసిడ్ పోసి చంపుతానని భయపెట్టడంతో పాటు… 2018లో ఆమె నగ్నచిత్రాలను వెబ్ బే బహిర్గతం చేసినట్టు మెరిట్ ఫిర్యాదు చేసింది. భారత్ లో రైతు ఆందోళనలకు మద్దతు ఇచ్చిన వెబ్ బే …లీసెస్టర్ ఈస్ట్ ఎంపీగా ఉన్నారు. సెప్టెంబరు 2018 , ఏప్రిల్ 2020 మధ్య 16 సార్లు మెరిట్ కు బెదిరింపు కాల్స్ చేసిందిట వెబ్ బె. ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో లేబర్ పార్టీ ఆమెను పార్టీనుంచి బహిష్కరించింది. ఎంపీ పదవికీ రాజీనామా చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో వెబ్ బే కుప్పకూలింది. అప్పీలుకు వెళ్తానని.. తాను నిర్దోషిననీ అంది.
వెబ్ బే భారత్ లో రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చింది. ఆసయమంలో ఇక్కడి రైతుల తరపున చాలా యాక్టివ్ గా పనిచేసింది. భారత్ లో రైతు ఉద్యమంపై యూకే ప్రభుత్వం కూడా ప్రకటన చేయాలంటూ ఈ పిటిషన్ కు పిలుపునిచ్చింది. శాంతియుతంగా నిరసన తెలిపడం పౌరుల ప్రాథమిక హక్కు అని…భారత్ లో ఆందోళన చేస్తున్న రైతులకు రక్షణ కల్పించాలని…తీవ్రస్వరంతో గొంతెత్తారు వెబ్ బే. అంతేకాదు భారత్ లో రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేసిన రెహన్నా వంటి వారికి ఈ బ్రిటీష్ ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉద్యమంపై రాద్దాంతం చేస్తూ టూల్ కిట్ కుట్ర చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని వెబ్ బే డిమాండ్ చేసింది.
‘భారత రైతులకు అంతర్జాతీయ సమాజం సంఘీభావం తెలపాలి’ అనే శీర్షికతో పూర్తి ఆవాస్తవాలతో రాసిన కథనాన్ని తన వెబ్ సైట్లో ప్రచురించింది. శాంతియుత నిరసనకారులపై, పోలీసులు, ఇతర గుంపు దాడిచేస్తోందని, అందుకు వీడియో ఆధారాలున్నాయని తన కథనంలో విషం చిమ్మింది.
నిరసనకారులపై దాడి చేయడం, అన్యాయంగా అరెస్ట్ చేయడం, హత్యచేయడం దుర్మార్గపు పని అంటూ గొంతెత్తిన వెబ్ బే ఓ మహిళను వేధించిన కేసులో దోషిగా తేలడం గమనార్హం.