73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్య్ర యోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను కొలువుదీర్చారు. జలియన్ వాలాభాగ్ వంటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ శకటం రూపొందించారు, ఇక ఇటీవల మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తో ఉత్తరప్రదేశ్ శకటం ఆకట్టుకుంది.