గణతంత్ర ఉత్సవాల్లో కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో సందేశాన్ని నమోదు చేశారు. తరువాత కర్తవ్యపథ్ పరేడ్ ను ప్రత్యేక అతిధి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్లాతో కలిసి తిలకించారు. ఈ సారి కూడా ఆయన ధరించిన తలపాగా అందర్నీ ఆకట్టుకుంది. పొడవైన వస్త్రం వేలాడేవిధంగా అనేక రంగులతో కూడిన ఈ రాజస్థానీ తలపాగా ప్రత్యేకత ఏంటా అందరూ చర్చించుకుంటున్నారు. అయితే… తెల్లని కుర్తా,ఆ పైన నల్లని కోటు ధరించిన మోదీ రంగు రంగుల తలపాగాను ధరించడానికి కారణం మన దేశంలోని వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకేనంటున్నారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1618467495895269377?s=20&t=epwKIC8_ZDTUbv4ZL8tnAQ