గణతంత్ర దినోత్సవ వేళ భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ పరేడ్ సాగింది. త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు,ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహా 16 విభాగాలు కవాతులో పాల్గొన్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ….భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.