కేంద్ర సాంస్కృతికశాఖ ఢిల్లీ ఇండియాగేట్ దగ్గర ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఘనతను ప్రతిబింబించేలా ఈ షో సాగింది. 250 డ్రోన్లు చేసిన విన్యాసాలు హస్తినవాసుల్ని విశేషంగా అలరించాయి. సందర్శకులు ఆ దృశ్యాలను కెమెరాల్లో, ఫోన్లలో బంధించేందుకు ఎగబడ్డారు. శుక్రవారం 8.35 నుంచి పదినిమిషాలపాటు డ్రోన్ షో సాగింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకు ఉన్న రాజ్ పథ్ మార్గాన్ని ప్రధాని మోదీ గురువారమే కర్తవ్యపథ్ గా మార్చిన సంగతి తెలిసిందే.దాంతో పాటు ఆధునీకరించిన సెంట్రల్ విస్టాను మోదీ ఆవిష్కరించారు. అదే రోజు ఇండియాగేట్ వెనకవైపున 28 అడుగుల నేతాజీ శిలా విగ్రహాన్నీ ఆయన ఆవిష్కరించారు.
#WATCH | Ministry of Culture organises a drone show at the India Gate, in Delhi. pic.twitter.com/Cb3EeywRYI
— ANI (@ANI) September 9, 2022