‘యాంటీ-ఇస్లామోఫోబియా’ ఉద్యమ నాయకురాలిగా చెప్పుకునే, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ను రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది పాకిస్తాన్. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఆమె… భారత్ తీరును పాకిస్తాన్ కు ఆందోళన కలిగిస్తోందని… ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పీవోకే నుంచి ఇస్లామాబాద్ వెళ్లి ఇమ్రాన్ ఖాన్ నూ కలిసింది ఈ రాడికల్ ఇస్లామిస్ట్ రాజకీయ నాయకురాలు. ఇస్లామోఫోబియాలో తమ పోరాటాన్ని పరస్పరం ప్రశంసించుకున్నారు ఇద్దరూ. అసలైతే ఇమ్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకే ఆమె పాకిస్తాన్ ను సందర్శించింది. తరువాత పాక్ అధ్యక్షుడు సుల్తాన్ మహమూద్ చౌదరి, పాకిస్తాన్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్లను కూడా కలుసుకున్నారు. ఆమె జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆ నాయకులతో చర్చించారు.
మిన్నెసోటా నుంచి వివాదాస్పద ముస్లిం లా మేకర్ కాశ్మీర్లోని ఆక్రమిత ప్రాంతాలను సందర్శించడాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. అయితే ఆమె పర్యటన అనధికారికమేనని, పూర్తిగా ఆమె వ్యక్తిగతమని అమెరికా చెప్పింది.
కశ్మీర్, ఇస్లామోఫోబియా సమస్యలపై చర్చించడానికి ఇల్హాన్ ఒమర్ మరికొందరు పాకిస్తాన్ రాజకీయ నాయకులతో సమావేశం అయింది. ఇక్కడి విషయాల్ని అంతర్జాతీయంగా చర్చకు పెడతానని వారికి చెప్పంది.
డెమొక్రాట్ టికెట్పై మిన్నెసోటా నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన ఇల్హాన్ ఒమర్, ముస్లిం ప్రపంచంలో సెలబ్రిటీ హోదాను సాధించారు. గ్లోబల్ ముస్లిం బ్రదర్హుడ్ వెలుపల ఒమర్ శక్తివంతమైన ఇస్లామిస్ట్ లాబీల కోసం పని చేస్తున్నారు. ఆధునిక సమాజాలలో రాడికల్ ఇస్లాంను ముందుకు తీసుకురావడం ఆమె ఏకైక లక్ష్యం. అసలైతే ఒమర్ మూలాలు సోమాలియావి. 1995లో 12 ఏళ్ల వయసులో అంతర్యుద్ధం సమయంలో అక్కడినుంచి పారిపోయి శరణార్థిగా యూఎస్ చేరుకుంది. తరువాత ఐదేళ్లకు అంటే 17 ఏళ్ల వయసలో పౌరసత్వం పొందింది. నవంబర్ 2016లో US కాంగ్రెస్లో మొదటి సోమాలి-అమెరికన్గా ఆమె ఎన్నికలో గెలిచింది.
యుఎస్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను దాటవేయడానికి ఒమర్ తన సోదరుడిని వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికాకు అక్రమంగా వలస రావడం, అందుకు సోదరుడినే పెళ్లాడ్డంపై విచారణ జరపాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో న్యాయశాఖను కోరారు కూడా. రాడికల్ ఇస్లామిస్టులు చెప్పే అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తుందీమె. ముఖ్యంగా కొన్నేళ్లుగా కేవలం భారత వ్యతిరేక కథనాల్ని ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె ఈ ప్రచార యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక సహాయాన్ని కూడా కోరింది.
భారతదేశంలోని ఇతర వామపక్ష-ఉదారవాద వర్గాల మద్దతుతో, US ప్రతినిధుల సభలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తడంలో పాకిస్తాన్ అనుకూల వైఖరితో US ఏజెన్సీలను జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంటారు ఇల్హన్. భారతదేశంలోని మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల సమస్యలు తోపాటు వాక్ స్వాతంత్య్రం గురించి అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. దేశంలోని ముస్లింలు హిందువుల చేతుల్లో అఘాయిత్యాలను గురవుతున్నారని పలు నివేదికలు ఇచ్చారు. అనేక వేదికలపై చెప్పారు. గతేడాది దక్షిణాసియా మానవ హక్కులపై యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ హియరింగ్ లో పాల్గొన్న ఆమె… 1990ల్లో కశ్మీరీ హిందువుల తరిమివేత, మారణహోమంపై యూఎస్ కాంగ్రెస్ ముందు సాక్ష్యాలు చెప్పిన భారతీయ జర్నలిస్టు ఆర్తి టీకూ సింగ్ పై ఆమె దాడి చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)