తాను చదువుకున్న విద్యాసంస్థకు ఏకంగా వందకోట్లు విరాళమిచ్చారొకాయన. ఆయన మరెవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వార్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో ఏర్పాటుచేయతలపెట్టిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు మద్దతిస్తూ వ్యక్తిగత విరాళంగా వందకోట్లు ప్రకటించారు రాకేశ్. ఆయన కాన్పూర్ ఐఐటీ పూర్వవిద్యార్థి. రాకేశ్ ఉదారతకు ధన్యవాదాలు అంటూ ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరాండికర్ ట్వీట్ ద్వారా థాంక్స్ చెప్పారు. అంతే కాదు మెడికల్ కాలేజీ పూర్తైన తరువాత అడ్వైజరీ బోర్డులో మెంబర్ గా రాకేష్ ఉంటారని ఆయన తెలిపారు. ఐఐటీ ప్రాంగణంలోనే నిర్మిస్తున్న స్కూల్లో 5 వందల పడకల ఆస్పత్రి, అకడమిక్ బ్లాక్, హాస్టల్ ,సర్వీస్ బ్లాక్ తో పాటు ఔషధాలపై పరిశోధనలు చేసేందుకు రీసెర్చ్ సెంటర్ వంటివీ ఏర్పాటు చేయనున్నారు. 3 నుంచి 5 ఏళ్లలో స్కూల్ పూర్తవుతుందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది.
https://twitter.com/IITKanpur/status/1511245854866571265?s=20&t=QgPqwrvWi4vBIYWtbB4juQ